టీడీపీ నేతలకు ఎమ్మెల్యే రోజా కౌంటర్‌.. కల్లు తాగిన కోతుల్లా..

టీడీపీ నేతలకు ఎమ్మెల్యే రోజా కౌంటర్‌.. కల్లు తాగిన కోతుల్లా..
x
టీడీపీ నేతలకు ఎమ్మెల్యే రోజా కౌంటర్‌.. కల్లు తాగిన కోతుల్లా..
Highlights

టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. టీడీపీ నేతలు కల్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌పై విమర్శలు చేయడం...

టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. టీడీపీ నేతలు కల్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌పై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులైపారిందన్న రోజా హెల్త్‌ డ్రింకింగ్‌గా మద్యపానాన్ని ప్రమోట్‌ చేశారని విమర్శించారు.

మందు బాటిళ్లు టీడీపీ ఆఫీసులో ప్రదర్శించారంటే అది టీడీపీ ఆఫీసా లేక బార్ షాపా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మద్యం ఎరులై పారిందని ఈ విషయాన్ని మహిళలెవరూ మర్చిపోలేదని రోజా అన్నారు. మద్యపానం నిషేధం దిశగా తాము చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories