పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కాసేపు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు.
పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కాసేపు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. బందలుప్పి జెడ్పీ స్కూల్కు వెళ్లిన ఆయన అక్కడ 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతి తీసుకొని పాఠాలు చెబుతూ .. హిందీ, గణితం, సైన్స్ సబ్జెక్టులపైన విద్యార్థుల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. గతంలో ప్రొఫెసర్గా పనిచేసిన అయన మళ్ళీ ఇలా ఉపాధ్యాయుడిగా మారి గణితంలో కొన్ని లెక్కల్ని బోర్డుపై విద్యార్థులకు బోధించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. " పేదరికం చదువుకోవడానికి అడ్డు రాకూడదనే తలంపుతో నా వ్యక్తిగత ఖర్చులతో 10వ తరగతి విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే మోడల్ పేపర్స్ ను తయారుచేయించి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పాఠశాలకు పంపిణీ చేయడం జరుగుతుందని అయన పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షల సమయంలో కాలాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని సూచించారు.
పదవ తరగతిలో మంచి మార్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అలానే ప్రతీ ఒక్కరూ ఫైనల్ పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని అయన ఆకాంక్షించారు. తమకి ఇంతటి సహాయం చేసిన తమ ప్రియతమ ఎమ్మెల్యే జోగారావు గారికి విద్యార్థులు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బందలుప్పి ZPH పాఠశాలను సందర్శించిన అనంతరం విద్యార్థులకు కాసేపు వివిధ సబ్జెక్ట్స్ మీద బోధించడం జరిగింది
— Alajangi Jogarao - MLA (@alajangijogarao) February 13, 2020
అనంతరం నా వ్యక్తిగత ఖర్చుతో 10వ తరగతి విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే మోడల్ పేపర్స్ ను తయారుచేయించి వాటిని పుస్తకరూపంలో ప్రింట్ చేసి పంపిణీ చేసాం.@ysjagan @YSRCParty pic.twitter.com/7J4wR2gzEE
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire