నేడే వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

నేడే వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం
x
Highlights

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం. సీఎం వైఎస్ జగన్‌చే ప్రారంభం. సాయంత్రం ఐదు గంటలదాక విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో జగన్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. మధ్యాహ్నం మూడున్నర నుంచి సాయంత్రం ఐదు గంటలదాక విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. కొత్త ఆఫీసులో అన్ని హంగులు ఏర్పాటు చేశారు. బ్యాక్ ఆఫీసు, సోషల్ మీడియా విభాగం, మీడియా కోఆర్డినేషన్ ఇలా పార్టీకి చెందిన విభాగాలన్నీ ఇక్కడి నుంచే పని చేస్తాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories