YS Sunitha: కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ సునీత పోస్టర్ల కలకలం

YS Sunitha: సునీత రాజకీయరంగ ప్రవేశం చేస్తుందంటూ

Dhatripriya
Updated on: 25 April 2023 11:36 AM IST
YS Sunitha Political Entry posters Went Viral
X

YS Sunitha: కడపజిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ సునీత పోస్టర్ల కలకలం

YS Sunitha: కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ సునీతారెడ్డి పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సునీత రాజకీయరంగ ప్రవేశం చేస్తుందంటూ.. రాత్రికి రాత్రి పట్టణంలో వాల్ పోస్టర్లు అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. పోస్టర్‌లలో వైఎస్ వివేకా, టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్య నేతల ఫోటోలు ఉన్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ కాగా, మరి కొందరి అరెస్ట్‌లు ఉంటాయనే టాక్‌ వినిపిస్తోంది. ఈ తరుణంలోనే.. వైఎస్‌ సునీత పొలిటీకల్‌ ఎంట్రీ.. ఇస్తున్నట్లు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

కడపజిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్ల కలకలం రేగింది. వై.యస్. సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ రాత్రి కి రాత్రి పట్టణంలో వాల్ పోస్టర్ల అతికించారు గుర్తు తెలియని వ్యక్తులు. పోస్టర్ లలో వై.యస్.వివేకా, టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్య నేతల ఫోటోలు ఉన్నాయి. అయితే, ఈ ఫోటోలు ఎవరు అతికించారనే విషయం తెలియరాలేదు. నిజంగానే, వైఎస్‌ సునీత పొలిటీకల్‌ ఎంట్రీ ఇస్తారా.. లేక.. ఇదంతా ఫేక్‌ న్యూస్‌ అనేది తెలియాల్సి ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story