చంద్రబాబుపై వైసీపీ ఎంపీ ఫైర్

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ ఫైర్
x
MP Vijayasai Reddy(File photo)
Highlights

ఒకపక్కా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది.

ఒకపక్కా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పై వరుస ట్వీట్లు చేస్తూ విమర్శించారు. చంద్రబాబూ ... చందాలూ దందాలూ అంటూ నాపై ఆరోపణలు చేశారు. మీ ఆస్తులు, నా ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ లేఖలు రాద్దాం, పిటీషన్లు వేద్దాం. కచ్చితంగా విచారణ జరిగేలా చూద్దాం. రెడీనా? అంటూ సవాల్ విసిరారు..

అంతేకాకుండా శవ రాజకీయాల కోసం చంద్రబాబుకు మరణ మృదంగం మోగుతుండాలి. కరోనా మరణాలు రాష్ట్రంలో 2 శాతం మాత్రమే ఉండటంతో దిక్కుతోచడం లేదాయనకు. వాటినీ దాస్తున్నారని బురద కుమ్మరించడానికీ సిగ్గుపడడు. 2 లక్షల టెస్టింగ్ కిట్లను కొరియా నుంచి కొన్నది దేశం మొత్తం మీద ఆంధ్రానే. ఇలాంటివి కనిపించవు అంటూ మండిపడ్డారు..

కరోనా వైరస్ ఇప్పట్లో కనుమరుగు కాదు. కొంత కాలం దాంతో కలిసుండాల్సిందే అన్నందుకు సిఎం జగన్ గారు చేతులెత్తేశారని ఎద్దేవా చేశాడు. ఎల్లో మీడియా 'జయము జయము చంద్రన్న' భజన అందుకుంది. ప్రపంచమంతా అంటున్నదే సిఎం గారు చెప్పారు. ఏదైనా మంత్ర దండం ఉంటే దేశాన్ని కాపాడొచ్చు గదా బాబూ! అంటూ ఎద్దవా చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories