సందు దొరకలేదు కానీ ఈ ఐడియా ఇచ్చింది నేనే అని డప్పు వాయించుకునేవాడు: విజయసాయిరెడ్డి

సందు దొరకలేదు కానీ ఈ ఐడియా ఇచ్చింది నేనే అని డప్పు వాయించుకునేవాడు: విజయసాయిరెడ్డి
x
Vijay SaiReddy (File Photo)
Highlights

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబుపై విజయ సాయిరెడ్డి ట్విటర్లో మండిపడ్డారు. 'ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్...

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబుపై విజయ సాయిరెడ్డి ట్విటర్లో మండిపడ్డారు. 'ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం జీవోను కొట్టివేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లకూడదట. పిటీషన్లు వేయిస్తాడు. ఎగువ కోర్టుకు వెళ్లాలనే ఆలోచన చేయడం అమానుషం అంటాడు. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల రక్తం తాగావు. పేద పిల్లలు నీ మనవడిలా చదువుకోవద్దంటావు. వాళ్లేం పాపం చేశారు బాబూ? అని విమర్శించారు.

దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయని, 'ఎల్లో వైరస్' ఇక జాగారం చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. దేశం మొత్తమ్మీద సీఎం జగన్ లా చొరవ చూపిన రాష్ట్రం మరేదైనా ఉంటే 'ఎల్లో మీడియా' చూపించాలని సవాల్ విసిరారు. 'విజనరీ'కి సందు దొరకలేదు కానీ ఈ ఐడియా ఇచ్చింది తానేనని డప్పు వాయించుకునేవాడు అంటూ పరోక్షంగా చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories