చంద్రబాబు కావాలనే బురద జల్లుతున్నారు: అంబటి

చంద్రబాబు కావాలనే బురద జల్లుతున్నారు: అంబటి
x
Highlights

ఏపీలో వైఎస్ జగన్ పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ అమలు...

ఏపీలో వైఎస్ జగన్ పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ అమలు చేస్తూ పారదర్శకంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. వందరోజుల పాలనలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలకు చంద్రబాబు ఆజ్యంపోశారని మండిపడ్డారు. ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై బురదజల్లుతూ తన అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories