టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి.. శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి.. శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం
x
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైఎస్సార్ సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది....

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైఎస్సార్ సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే గత పాలక మండలిని రద్దు చేసింది. టీటీడీ బోర్డు నూతన చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ కొత్త చైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి ఉదయం 11 గంటలకు గరుడ ఆళ్వార్‌ సన్నిధిలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన తిరుమల చేరుకున్న వైవీ సుబ్బారెడ్డికి ఘనస్వాగతం లభించింది. వైసీపీ నాయకులు, టీటీడీ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. తనను టీటీడీ ఛైర్మెన్ గా నియమించినందుకు సీఎం జగన్ కు వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీకి కొత్త చైర్మన్‌ను నియమించిన ప్రభుత్వం త్వరలోనే పాలకమండలి సభ్యుల నియామకాలు కూడా చేపట్టనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories