గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. బోండా ఉమ, బుద్దా వెంకన్నల కారుపై దాడి

గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. బోండా ఉమ, బుద్దా వెంకన్నల కారుపై దాడి
x
Highlights

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల కారుపై దాడి జరిగింది. ఈ కారులో బుద్దా వెంకన్న, బొండా ఉమా ఉన్నారు. నిన్న జరిగిన దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను...

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల కారుపై దాడి జరిగింది. ఈ కారులో బుద్దా వెంకన్న, బొండా ఉమా ఉన్నారు. నిన్న జరిగిన దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కారును అడ్డగించిన ఓ వైసీపీ కార్యకర్త దాడి చేశాడు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ కార్యకర్తలు తమ వెంటపడ్డారని బోండా ఉమ వెల్లడించారు. నిన్న మాచర్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడంతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో మాచర్లకు బోండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎవరూ లేరని బోండా ఉమ వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories