వామ్మో..ప్రేమించిన వాడికోసం 'లాక్ డౌన్' లో ఆ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాక్!

వామ్మో..ప్రేమించిన వాడికోసం లాక్ డౌన్ లో ఆ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాక్!
x
Highlights

తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఓ యువతి ఏకంగా 40 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి వివాహం చేసుకుంది. అది కూడా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో...

తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఓ యువతి ఏకంగా 40 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి వివాహం చేసుకుంది. అది కూడా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో కావడం విశేషం. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన కళ్లేపల్లి సాయి పున్నయ్య, హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన భవానీ కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారు. వారి విషయం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పున్నయ్యకు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారు. దీంతో ప్రేమికులిద్దరూ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

హనుమాన్‌ జంక్షన్‌ నుంచి ఒంటరిగా బయల్దేరిన భవానీ 40 కి.మీ కాలినడకన మచిలీపట్నం చేరుకుంది. అక్కడ ప్రేమికులిద్దరూ బుధవారం వివాహం చేసుకున్నారు. ఇంటి నుంచి పెద్దలు ఫోన్లు చేసి బెదిరించడంతో చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారు. ఇంత దూరం ఎలా వచ్చావని పోలీసులు ఆ యువతిని ప్రశ్నించగా నడుచుకుంటూ వచ్చినట్టు తెలిపింది. ప్రేమించిన వ్యక్తి కోసం అంత దూరం ఒంటరిగా నడుచుకుంటూ వచ్చానని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించిన పోలీసులు వారికి నచ్చజెప్పి కొత్త జంటను వారి వెంట పంపడంతో కథ సుఖాంతమైంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories