తహశీల్దారు కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం

ప్రతీకాత్మక చిత్రం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

నెల్లూరు జిల్లాలో ఓ మహిళ తహశీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటి స్థలం విషయంలో చేజర్ల ఎమ్మార్వో వేధిస్తున్నారంటూ పురుగులు మంది...

నెల్లూరు జిల్లాలో ఓ మహిళ తహశీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటి స్థలం విషయంలో చేజర్ల ఎమ్మార్వో వేధిస్తున్నారంటూ పురుగులు మంది సేవించేందుకు యత్నించింది. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే స్పందన కార్యక్రమంలో ఉన్న అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే పక్కనే ఉన్న వాళ్లు వారించారు.

పెరుమాళ్లపాడులో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించుకోకుండా ఎమ్మార్వో అడ్డుకుంటున్నారని ఆరోపించింది బాధితురాలు. భూమి విక్రయించిన వారి నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా తహశీల్దార్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపింది. తహశీల్దార్ మాత్రం మహిళ ఆరోపణలను ఖండించారు. కొందరు వెనుక ఉండి నాటకమాడిస్తున్నారని అన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories