భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను చితక్కొట్టిన భార్య

భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను చితక్కొట్టిన భార్య
x
Highlights

విశాఖ జిల్లాలో కట్టుకున్న భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను చితక బాదింది ఓ భార్య. గంగాధర్ రెడ్డి మరో యువతితో వివాహేతర సంబంధం...

విశాఖ జిల్లాలో కట్టుకున్న భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను చితక బాదింది ఓ భార్య. గంగాధర్ రెడ్డి మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏడాది కాలంగా విశాఖ షీలానగర్ లోని తులసి ఆపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న భార్య మహిళా సంఘాల సభ్యులు, పోలీసులతో కలిసి అపార్ట్ మెంట్ దగ్గరకు చేరుకుంది. భర్తతో కలిసి ఉన్న మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ది చేసింది. కొద్ది సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో పని చేస్తున్న సమయంలో గంగాధర్ రెడ్డి అనకాపల్లి మండలం కొత్తూరూ గ్రామానికి చెందిన పుష్పలతో ఏర్పడిన పరిచం కాస్త ప్రేమగా మారింది. కులాలు వేరేనై పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. కొంత కాలం తర్వాత గంగాధర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్య, కొడుకును దూరంగా ఉంచాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని భార్య పుష్పలత ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయకపోతే కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories