బోటు ప్రమాదంలో మరో కుటుంబం!

బోటు ప్రమాదంలో మరో కుటుంబం!
x
Highlights

గోదావరి బోటు ప్రమాదంలో మరో కుటుంబం చిక్కుకున్నట్టు వార్త వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి (35) విశాఖ...

గోదావరి బోటు ప్రమాదంలో మరో కుటుంబం చిక్కుకున్నట్టు వార్త వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి (35) విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం మహేశ్వరరెడ్డి, ఆయన భార్య స్వాతి (30), పిల్లలు విఖ్యాత్‌రెడ్డి (6), హన్సిక (4)ను పాపికొండలు చూసేందుకు బోటు ఎక్కారు. ప్రమాదం జరగడంతో వారు కూడా గల్లంతయ్యారని తెలుస్తోంది. మహేశ్వరరెడ్డి సోదరి రాజేశ్వరమ్మ అధికారులకు ఫోన్‌ చేయడంతో బోటు ప్రమాదంలో ఈ కుటుంబం కూడా గల్లంతు అయ్యిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. లాంచీ నిర్వాహకుల వద్ద లభించిన జాబితాలో 'మహేశ్వరరెడ్డి (త్రీ ప్లస్‌ జీరో), హైదరాబాద్‌' అనే ఉండేసరికి మహేశ్వరరెడ్డి కుటుంబం తెలంగాణకు చెందినగా భావించారు. అయితే రాజేశ్వరమ్మకు విషయం తెలియడంతో వారు ఆంధ్రాకు చెందిన వారుగా తెలిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories