ఆయన బయట తిరిగితే.. పోలీసులు లాటీలు ఝళపించాలి : వర్ల రామయ్య ట్వీట్

ఆయన బయట తిరిగితే.. పోలీసులు లాటీలు ఝళపించాలి : వర్ల రామయ్య ట్వీట్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటిస్తుండడం పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

ముఖ్య మంత్రి గారు! విశాఖ జిల్లాలో అంతాతానై, లాక్ డౌన్ కూడ లెక్కచేయకుండ వ్యవహరిస్తున్న విజయ సాయి రెడ్డిని మీ సామంత రాజుగా నియమించారా? రాజ్యసభ సభ్యుడను మాత్రమే అన్న సంగతి మరచి, మంత్రులను కాదని బొంగరంలా తిరుగుతున్న A2ను కట్టడి చేయండి.ఆయన బయట తిరిగితే, పోలీసులు కూడ లాటీలు ఝళపించాలి అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories