2019 ఎన్నికల్లో చంద్రబాబు అందుకే ఓడిపోయారు: కేంద్రమంత్రి జవదేకర్‌

2019 ఎన్నికల్లో చంద్రబాబు అందుకే ఓడిపోయారు: కేంద్రమంత్రి జవదేకర్‌
x
Highlights

ఇటివల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగలేని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే జోష్ లో ఉన్న బీజేపీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన...

ఇటివల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగలేని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే జోష్ లో ఉన్న బీజేపీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) తిరుపతిలో నిర్వహించిన సంస్థాగత పథం కార్యక్రమాని ముఖ్య అతిథిగా కేంద్ర పర్యావరణ, సమాచారశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ పాల్గొని బీజేపీ పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం-2019ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ జట్టుకట్టి విజయం సాధించారని, ఇక పోతే 2019 ఎన్నికల్లో విభేదించి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని అన్నారు.తోడుంటేనే దేశంలో ఎవరికైనా అధికారం దక్కుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మోడీ చరిష్మా దేశమంతటా ఓ ఉప్పెనలా పొంగుతోందని, మోడీ చేసిన అభివృద్ధి అన్ని వర్గాల ప్రజలను బీజేపికి అభిమానులను చేసిందని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories