ఈ ఎన్నికల్లో పోటీ చేయను : కేంద్ర మంత్రి ఉమా భారతి

ఈ ఎన్నికల్లో పోటీ చేయను : కేంద్ర మంత్రి ఉమా భారతి
x
Highlights

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేంద్ర మంత్రి ఉమాభారతి వెల్లడించారు. ఈ మేరకు ఆమె బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు శనివారం ఆమె లేఖ...

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేంద్ర మంత్రి ఉమాభారతి వెల్లడించారు. ఈ మేరకు ఆమె బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు శనివారం ఆమె లేఖ రాశారు. ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అధిష్టానం ఆదేశిస్తే బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గంగా నదీ కాలుష్య ప్రక్షాళనలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అందుకే అమిత్‌షాకు లేఖ రాశాను. అంటూ ఉమాభారతి పేర్కొన్నారు.

కాగా మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం ఉమాభారతి 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఎంపీగా గెలుపొందారామె. కరుడుగట్టిన హిందుత్వవాదిగా గుర్తింపు పొందారు. కాగా ఇదివరకే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ కూడా ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories