టీటీడీ చైర్మన్‌ కార్యాలయ సిబ్బంది చేతివాటం..చైర్మన్ కళ్లుగప్పి..

టీటీడీ చైర్మన్‌ కార్యాలయ సిబ్బంది చేతివాటం..చైర్మన్ కళ్లుగప్పి..
x
Highlights

టీటీడీ చైర్మన్ కార్యాలయం సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. చైర్మన్ కళ్లు గప్పి విఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లను అధిక దరలకు అమ్ముకుంటున్నారు. బ్రేక్‌...

టీటీడీ చైర్మన్ కార్యాలయం సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. చైర్మన్ కళ్లు గప్పి విఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లను అధిక దరలకు అమ్ముకుంటున్నారు. బ్రేక్‌ దర్శనం కలిగిన ఇద్దరు భక్తులకు ప్రొటోకాల్‌ వీఐపీ దర్శనం చేయిస్తామని రూ.24 వేలు తీసుకుని మోసం చేశారు. తాము దారుణంగా మోసపోయామని గుర్తించిన భక్తులు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాగా ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. విషయం తెలియడంతో టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించారు. దీంతో ఒకరిద్దరు సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్టు విజిలెన్ అధికారుల విచారణలో తేలింది. బ్రేక్ దర్శనం టికెట్లకు సంబంధించి భక్తులను మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని వెంటనే బదిలీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాని ఆదేశించారు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories