గుంటూరు జిల్లాలో భూప్రకంపనలు..

గుంటూరు జిల్లాలో భూప్రకంపనలు..
x
Highlights

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శనివారం స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించిందని దాంతో...

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శనివారం స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించిందని దాంతో బెంబేలెత్తిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా భూప్రకంపనలు సంభవించడంతో ఇళ్ల ప్రజలు తమ ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు ఏం జరుగుతుందో స్థానికులకు అర్థం కాలేదు. స్వల్పంగా భూమి కంపించిన విషయాన్ని తెలుసుకున్న ప్రజలు కాసేపు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇదిలావుంటే దీనివల్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు అక్కడి ప్రజలకు చెప్పినట్టు తెలుస్తోంది. సాధారణంగా భూమిలో అధిక వేడి కారణంగా ఇలా జరుగుతుంటుందని చెప్పారు. దాంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories