రెండోసారి గ్యాస్ లీకైందని వస్తున్న వార్తల్లో నిజం లేదు: ఏపీ పోలీస్ శాఖ

రెండోసారి గ్యాస్ లీకైందని వస్తున్న వార్తల్లో నిజం లేదు: ఏపీ పోలీస్ శాఖ
x
Highlights

విశాఖపట్నంలోని గోపాలపట్నం దగ్గరలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో రెండోసారి గ్యాస్‌ లీక్‌ అయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ పోలీస్‌శాఖ స్పష్టం...

విశాఖపట్నంలోని గోపాలపట్నం దగ్గరలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో రెండోసారి గ్యాస్‌ లీక్‌ అయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ పోలీస్‌శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ పోలీసు ట్విటర్‌ ఖాతాలో ఓ మెసేజ్‌ పోస్ట్‌చేశారు. అవాస్తవాలను నమ్మొద్దని ప్రజలకు సూచించింది.

ప్రస్తుతం వాయువును తొలగించేందుకు సిబ్బందిపనిచేస్తున్నారని మరమ్మతులు చేపట్టారని తెలిపింది. మెయింటనెన్స్‌ టీం మరమ్మత్తు చర్యలు చేపట్టి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది. గురువారం తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో రసాయన వాయువు లీక్‌ అయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు లోనయ్యారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories