వాషింగ్టన్ డీసీ చేరుకున్న జగన్ ... ఘనస్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు

వాషింగ్టన్ డీసీ చేరుకున్న జగన్ ... ఘనస్వాగతం పలికిన  ప్రవాసాంధ్రులు
x
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్..ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశాల్లో పాల్గొన్నారు.

అగ్రరాజ్యం పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్..ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశాల్లో పాల్గొన్నారు. అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లా ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ గిలీడ్ ప్రతినిధి క్లాడియో లిలియన్ ఫెలడ్ తో సమావేశమయ్యారు. హెచ్ ఐవీ ఎయిడ్స్, హెపటైటిస్ బీ, సీ వ్యాధులపై గిలీడ్ సంస్థ ఔషధాలను తయారుచేస్తోంది. ఏపీకి చెందిన ఔషధ కంపెనీలతో భాగస్వామ్యానికి ముందుకు రావాలని ఏపీ సీఎం జగన్ కోరారు. హై ఎండ్ ఔషధాల తయారీకి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవలని ఆయన సూచించారు. ఫార్మా రంగంలో ఉత్తమ టెక్నాలజీని రాష్ట్రానికి అందించాలని కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories