ఆఫీసులో వీఆర్వో మసాజ్ మత్తు..గ్రామస్తుల ఫిర్యాదు!

ఆఫీసులో వీఆర్వో మసాజ్ మత్తు..గ్రామస్తుల ఫిర్యాదు!
x
Highlights

ప్రభుత్వ కార్యాలయంలో మసాజ్ చేయించుకుంటూ కెమెరాకు చిక్కాడు ఓ వీఆర్వో. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి....

ప్రభుత్వ కార్యాలయంలో మసాజ్ చేయించుకుంటూ కెమెరాకు చిక్కాడు ఓ వీఆర్వో. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కిర్లంపూడి మండలం, వేలంక గ్రామ సచివాలయంలో భాస్కరరావు వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆఫీసులో మహిళా వాలంటీర్లు, ఇతర సిబ్బంది ఉండగానే మసాజ్ చేసే వ్యక్తిని పిలిపించుకుని మసాజ్ చేయించుకున్నారు. పని వేళల్లో ఇలా చేయడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఉన్నతాధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. విధులపై నిర్లక్ష్యం చూపించే ఇలాంటి అధికారులపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories