వైసీపీ ఎంపీకి బుద్దా కౌంటర్

వైసీపీ ఎంపీకి బుద్దా కౌంటర్
x
TDP MLC Buddha Venkanna (File photo)
Highlights

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతుది.

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతుది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "చంద్రబాబూ ... చందాలూ దందాలూ అంటూ నాపై ఆరోపణలు చేశారు. మీ ఆస్తులు, నా ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ లేఖలు రాద్దాం, పిటీషన్లు వేద్దాం. కచ్చితంగా విచారణ జరిగేలా చూద్దాం. రెడీనా?" అంటూ చంద్రబాబుకి సవాల్ విసిరారు.

అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. ఏంటి విజయసాయిరెడ్డి సీబీఐ విచారణ అంటున్నావ్? 16 నెలలు ఊచలు లెక్కపెట్టడం, ప్రతీ శుక్రవారం కోర్టుముందు నిలబడటం, సీబీఐ జగన్, విజయసాయి రెడ్డి అక్రమ ఆస్తులు 43 వేల కోట్లు అని ప్రకటించేసింది కదా అంటూ ఎద్దావా చేశారు. మళ్ళీ కొత్తగా విచారణ మొదలుపెడితే ఇంకొన్ని రోజులు బయట స్వైరవిహారం చెయ్యాలని ఆశపడుతున్నావా? మీ మహామేత ఆత్మగా మారక ముందే అనేక విచారణలు, కమిటీలు వేసినా చంద్రబాబు గారి పై బురద జల్లడం సాధ్యం కాక చేతులెత్తేసాడు. ఇక ఏడాదిగా కమిటీలు,విచారణలు అంటూ మీరు ఏమి పికారో ప్రజలకు ఎరుకే అంటూ మండిపడ్డారు.

రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మర్చిపోతే ఎలా విజయసాయిరెడ్డీ. తండ్రి శవం పెట్టుబడిగా సంతకాలు, ప్రజల మరణాలు పెట్టుబడిగా ఓదార్పు యాత్ర, బాబాయ్ బాత్ రూమ్ హత్య పెట్టుబడిగా ఎన్నికల ప్రచారం. అసలు శవం కనపడితే వదలకుండా నాన్న అకౌంట్ లో వేసి పబ్లిసిటీని పీక్స్ కి తీసుకెళ్లారు. కరోనాతో సహజీవనం చెయ్యండి... పోయేవాడు పోతాడు, ఓదార్పు-2కి పనికొస్తుంది అనే దుర్మార్గపు ఆలోచనలు మంచిది కాదు అంటూ " ట్వీట్ చేశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories