చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ .. రైతులను ఇబ్బంది పెట్టింది చంద్రబాబే

చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ .. రైతులను ఇబ్బంది పెట్టింది చంద్రబాబే
x
మద్దాలి గిరి
Highlights

గత ఐదేళ్లుగా రైతులను ఇబ్బంది పెట్టింది చంద్రబాబే అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం...

గత ఐదేళ్లుగా రైతులను ఇబ్బంది పెట్టింది చంద్రబాబే అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఆయన నియోజకవర్గ సమస్యలపైనే కలిసినట్లు వివరించారు.

ఐదేళ్ల కాలంలో అమరావతిని నిర్మించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. లెజిస్లేటివ్ కేపిటల్‌గా అమరావతి ఉంటుందని జగన్ చెప్పినట్లు మద్దాలి వివరించారు. ఇంగ్లీష్ మీడియంపై కూడా చంద్రబాబు రెండు వైఖరులు ఉన్నాయన్న ఆయన రైతులను మోసం చేయడంపై చంద్రబాబే సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. జగన్ డైనమిక్ లీడర్‌ అని పొగడ్తలతో ముంచెత్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories