ఏపీలో ఇసుక తుఫాన్

ఏపీలో ఇసుక తుఫాన్
x
Highlights

ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు దిగింది. ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది. రాజధాని పరిధిలోని మంగళగిరిలో టీడీపీ నిర్వహిస్తున్న...

ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు దిగింది. ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది. రాజధాని పరిధిలోని మంగళగిరిలో టీడీపీ నిర్వహిస్తున్న ధర్నాలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వెంటనే ఇసుక కొరతను నివారించాలని డిమాండ్ చేశారు. ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. గుంటూరు లోని లాడ్జీ సెంటర్ లో టిడిపి నేతలు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసన ర్యాలీలు చేపట్టింది. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ధర్నాలు చేపట్టారు. విశాఖలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. నిరసనలో పాల్గొన్న బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఇసుక పాలసీ వెంటనే ప్రకటించి రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి ఆందోళనకు దిగింది. తిరుపతి నాలుగుకాళ్ళ మండపం వద్ద రాస్తారొకో చేశారు. ఇసుక విధానాన్ని సమీక్షించి అవసరమైన వారందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories