ముఖ్యమంత్రి జగన్ కి నారా లోకేష్ లేఖ!

ముఖ్యమంత్రి జగన్ కి నారా లోకేష్ లేఖ!
x
Nara Lokesh, YS Jagan (File Photo)
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు.. అందులో భాగంగా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో 50లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇసుక సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే.. తాజా లాక్ డౌన్ వల్ల పుట గడవని దుర్భర జీవితం గడుపుతున్నారని, నూతన ఇసుక విధానం వలన ఉపాధి లేక, కుటుంబాలను పోషించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో కలచి వేసిందని అన్నారు.

ఇప్పుడు లాక్ డౌన్ వారిని మరింత దెబ్బతీసిందని, కార్మికులకు అందుబాటులో ఉన్న 1900కోట్ల బిల్డింగ్ సెస్ వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయిల ఆర్థిక సహాయం,చంద్రన్న భీమాను పునరుద్ధరించటంతో పాటు వారి జీవన భవిష్యత్తు కు ప్రభుత్వం భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ పేర్కొన్నారు.

శుక్రవారం రోజు కూడా ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు లోకేష్. ఆ లేఖలో చేనేత కార్మికుల కష్టాల గురించి పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల దాదాపు మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 81వేల పవర్ లూమ్ కార్మికులపైనా లాక్ డౌన్ ప్రభావం చూపింది. వారి జీవన విధానం దెబ్బతినటమే కాకుండా తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముడుకాక అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

అంతేకాకుండా ఆప్కో ద్వారా నేతన్నల వద్ద తయారై సిద్ధంగా ఉన్న స్టాక్ ను వెంటనే కొనుగోలు చేయాలని, లాక్ డౌన్ సమయంలో వీరంతా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నందున ప్రతి కుటుంబానికి 15వేల రూపాయల సాయం అందించాలని అన్నారు. క్లిష్ట సమయంలో నేతన్నల పట్ల ప్రభుత్వం దయచూపుతుందని ఆశిస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories