జగన్ బాటలోనే వైసీపీ నేతలు.. డాక్టర్ల మాస్కులే కొట్టేశారు: నారా లోకేష్

జగన్ బాటలోనే వైసీపీ నేతలు.. డాక్టర్ల మాస్కులే కొట్టేశారు: నారా లోకేష్
x
Highlights

ముఖ్యమంత్రి జగన్ బాటలోనే వైసీపీ నేతలు నడుస్తున్నారని.. ఇప్పటికీ 420 బుద్ధులు వదులుకోలేకపోతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు....

ముఖ్యమంత్రి జగన్ బాటలోనే వైసీపీ నేతలు నడుస్తున్నారని.. ఇప్పటికీ 420 బుద్ధులు వదులుకోలేకపోతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. డాక్టర్లకి ఇచ్చిన మాస్కులను వీఐపీలమంటూ వైసీపీ నాయకులు కొట్టేయ్యడం దారుణం' అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ నాయకులు బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందదని నారా లోకేష్ పెదవి విరిచారు. ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా నివారణకు నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు'' అంటూ మండిపడ్డారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories