చంద్రబాబుని విమర్శించే స్థాయి రోజాకి లేదు: దివ్యవాణి

చంద్రబాబుని విమర్శించే స్థాయి రోజాకి లేదు: దివ్యవాణి
x
Highlights

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజాపై సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సంచలన వాఖ్యలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజాపై సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సంచలన వాఖ్యలు చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దివ్యవాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైకాపా పాలనతో ఏపీ పతనమవుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పాలనంటే మేకప్‌ వేసుకోవడం కాదనే విషయం రోజా తెలుసుకోవాలని అన్నారు. . భజన కార్యక్రమాలు ఆపి ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. అసెంబ్లీలో రోజా డైలాగులు చెబుతున్నారని ఆమె వాఖ్యానించారు.

గతంలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు హుందాగా వ్యవహరించారని.. రోజా తీరుతో సినిమా ఇండస్ట్రీ తలదించుకోవాల్సి వస్తోందన్నారు. చంద్రబాబునను విమర్శించే స్థాయి రోజాకి లేదని దివ్యవాణి అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రజల మధ్యకు రాలేని దుస్థితిలో జగన్ , వైకాపా నేతలు ఉన్నారని అన్నారు.. రాజధాని ప్రజలను పోలీసులతో దారుణంగా కొట్టిస్తున్నారని ఆరోపించారు.

అమరావతిలో నిన్న రాజధాని రోజాను రైతులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ సమ్మిట్‌లో పాల్గొవడానికి వచ్చిన రోజా కాన్వయ్ అడ్డంగా నిలబడ్డారు. అమరావతికి న్యాయం చేయాలని రోజా కాన్వయ్‌కు ముందు నినాదాలు చేశారు. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ బయట కూడా రైతులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దీనిపైన స్పందించిన రోజా చంద్రబాబు రైతుల ముసుగులో టీడీపీ గూండాలతో తనపై దాడి చేయించారని ఆరోపించారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories