పీఎస్‌ వద్ద మాజీ మంత్రి అఖిలప్రియ ధర్నా.. టీడీపీ అభ్యర్థులను పార్టీ మారాలని ఎస్సై వేధిస్తున్నారని..

పీఎస్‌ వద్ద మాజీ మంత్రి అఖిలప్రియ ధర్నా.. టీడీపీ అభ్యర్థులను పార్టీ మారాలని ఎస్సై వేధిస్తున్నారని..
x
Highlights

కర్నూలు జిల్లాలోని చాగలమర్రి పోలీస్‌స్టేషన్‌ దగ్గర మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆందోళనకు దిగారు. ఎంపీటీసీలకు పోటీ చేసిన అభ్యర్థులను పార్టీ మారాలని...

కర్నూలు జిల్లాలోని చాగలమర్రి పోలీస్‌స్టేషన్‌ దగ్గర మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆందోళనకు దిగారు. ఎంపీటీసీలకు పోటీ చేసిన అభ్యర్థులను పార్టీ మారాలని చాగలమర్రి ఎస్సై పీరయ్య వేధిస్తున్నారని ధర్నా చేపట్టారు. ఎస్సై పీరయ్య వేధింపులను తట్టుకోలేక పీఎస్‌ ఎదుట ఇద్దరు టీడీపీ కార్యకర్తలు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని ఆమె తెలిపారు. వైసీపీ నేతలు ఫ్యాక్షన్‌ రాజకీయాలను ప్రోత్సహించేలా వ్యవరహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories