విజయసాయి రెడ్డి పై అయ్యన్నపాత్రుడు సెటైర్లు !

విజయసాయి రెడ్డి పై అయ్యన్నపాత్రుడు సెటైర్లు !
x
Highlights

ఇటీవల కాలంలో కలిసిమెలసి ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మొన్నటివరకు గోదావరి నీటి వాటాపై చర్చించుకున్న తెలుగు ముఖ్యమంత్రుల...

ఇటీవల కాలంలో కలిసిమెలసి ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మొన్నటివరకు గోదావరి నీటి వాటాపై చర్చించుకున్న తెలుగు ముఖ్యమంత్రుల మధ్య కృష్ణా జలాల తరలింపు అంశం చిచ్చు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల అనుబంధం గురించి గతంలో గొప్పగా చెప్పిన ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సెటైర్లు విసిరారు.

విజయసాయిరెడ్డి గారు మొన్నటివరకూ కేసీఆర్-జగన్ ది తండ్రి, కొడుకుల అనుబంధం అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తొలగిపోయాయి అన్నారు. ఇరు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ప్రాజెక్టులు చేపడుతున్నాయంటూ కేసీఆర్ గారి చేతిని నాకిన జగన్ గారు రాయలసీమ బిడ్డో, కాదో, అసలు జగన్ ఏపీకి చెందిన వ్యక్తో, కాదో నువ్వే తేల్చాలి సాయి రెడ్డి గారు. నాన్న కి కోపం వచ్చింది అని మెత్తబడతారా? మెడలు వంచి నీళ్లు సాధిస్తారా?' అని నిలదీశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories