బీజేపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు

బీజేపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు
x
Highlights

ఏపీలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు గురువారం బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ...

ఏపీలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు గురువారం బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, కావలి నుంచి జనసేన తరపున పోటీ చేసిన పసుపులేటి సుధాకర్, చిత్తూరు జిల్లాకు చెందిన వెంకయ్య, సి.చంద్రప్ప, రిటైర్డ్ ఇన్ కం టాక్స్ కమిషనర్ కంచర్ల హరిప్రసాద్, షేక్ నిజాముద్దిన్, మాజహర్ బేగ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. మోడీ నాయక్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని.. ఏపీలోనూ పార్టీ బలోపేతంగా అడుగులు వేస్తున్నామన్నారు మురళీధర్ రావు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories