శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
x
Highlights

తిరుమల శ్రీవారిని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈరోజు దర్శించుకున్నారు. నేటి ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో తలసాని స్వామి వారిని...

తిరుమల శ్రీవారిని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈరోజు దర్శించుకున్నారు. నేటి ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో తలసాని స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి వేదపండితులచే ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ప్రజా పరిపాలన అందించే నాయకుడిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిలు కలసి ముందుకు వెళ్తున్నారని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories