ఎన్టీఆర్, మోడీ ఫోటోలతో సుజనా ఫ్లెక్సీలు..ప్రత్యక్షరాజకీయాల్లోకి..

ఎన్టీఆర్, మోడీ ఫోటోలతో సుజనా ఫ్లెక్సీలు..ప్రత్యక్షరాజకీయాల్లోకి..
x
Highlights

ఇప్పటి వరకు పరోక్ష రాజకీయాల్లో ఉన్నానని ఇక నుంచి ప్రత్యక్షరాజకీయాల్లోకి రానున్నట్లు మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. బీజేపీలో చేరి...

ఇప్పటి వరకు పరోక్ష రాజకీయాల్లో ఉన్నానని ఇక నుంచి ప్రత్యక్షరాజకీయాల్లోకి రానున్నట్లు మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. బీజేపీలో చేరి తొలిసారిగా విజయవాడకు వచ్చిన ఆయన ఏపీలో బీజేపీ ప్రత్యమ్నాయం అవుతుందని అన్నారు. ప్రపంచ దేశాల ముందు దేహి అనే ప్రధానులే ఉన్నారన్నారు. ప్రధాని మోడీ మాత్రం భారత దేశం గొప్ప తనాన్ని చాటి చెబుతున్నారని చెప్పారు. కొద్దిసేపటి క్రితమే మాజీ కేంద్రమంత్రి, ఎంపీ సుజనా చౌదరి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి విజయవాడకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సుజనా చౌదరికి బీజేపీ కార్యకర్తలు., అభిమానులు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుజనా చౌదరికి స్వాగతం పలుకుతూ ఎన్టీఆర్, మోడీ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాద స్పదంగా మారాయి. ప్రధాని మోదీ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై ఒక్కొక్కరు ఒక్కోలా చర్చించుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories