జనసేన వీలినమని వస్తున్న వార్తలపై స్పందించిన శ్రీరెడ్డి ...

జనసేన వీలినమని  వస్తున్న వార్తలపై స్పందించిన శ్రీరెడ్డి ...
x
Highlights

పవన్ గారు మీ పార్టీని మరే పార్టీలోనూ క్లబ్ చేయవద్దు, మొత్తం విలువైన పానీయాన్ని పాడుచేయటానికి ఒక చుక్క పాయిజన్ సరిపోతుంది.. మీరు మాకు కావాలి

వివాదాలకి మారుపేరుగా మారిపోయింది శ్రీరెడ్డి ... రోజుకో సెలబ్రేటిని ఎంచుకొని ఎదో ఒక ఆరోపణలు చేస్తూ రోజు వార్తల్లో నిలుస్తుంది . ప్రస్తుతం తన మకాం చెన్నై కి మార్చిన తన ఆరోపణలు మాత్రం ఆపడం లేదు .. మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద ఉద్యమాన్నే మొదలు పెట్టిన శ్రీరెడ్డి అ తరవాత సైలెంట్ అయిపోయి బడాబడా సెలబ్రేటిలను టార్గెట్ చేస్తూ నిత్యం వివాదాలతో సావాసం చేస్తుంది . ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మొదటినుండి ఆరోపణలు చేసుకుంటూ వస్తున్న శ్రీరెడ్డి అయన పార్టీపై మరియు అయన వ్యక్తిగత విషయాలపై ఆరోపణలు చేస్తూ వస్తుంది . ఈ నేపధ్యంలో మరోసారి పవన్ కళ్యాణ్ పై స్పందిచింది శ్రీరెడ్డి ..

గత కొద్ది రోజులుగా జనసేన పార్టీని వీలినం చేస్తారన్న వార్తలు వస్తున్నాయి.. అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తమ పార్టీలో కలిపేయాలంటూ ఒక పెద్ద పార్టీ తనపై ఒత్తిడి తీసుకువస్తోందని సంచలన విషయం బయటపెట్టారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ జనసేనను విలీనం చేసేది లేదని స్పష్టం చేశారాయన. ఇదే విషయంపైన శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ లో స్పందిస్తూ "పవన్ గారు మీ పార్టీని మరే పార్టీలోనూ క్లబ్ చేయవద్దు, మొత్తం విలువైన పానీయాన్ని పాడుచేయటానికి ఒక చుక్క పాయిజన్ సరిపోతుంది.. " అని పోస్ట్ చేసింది . అయితే ఫస్ట్ టైం ఇటు పవన్ కళ్యాణ్ పై మరియు అయన పార్టీపై శ్రీరెడ్డి పాజిటివ్ గా స్పందించడం విశేషం..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories