కరోనాపై పోరుకు సత్యసాయి ట్రస్ట్ భారీ విరాళం.. ఏపీ సీఎం సహాయనిధికి ఇవాళ భారీగా విరాళాలు
కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సర్కార్ చేస్తున్న పోరాటానికి సత్యసాయి ట్రస్టు తన వంతు సహకారం అందించింది. ఈ మేరకు సీఎం సహాయ నిధికి రూ. 5 కోట్ల భారీ విరాళం...
కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సర్కార్ చేస్తున్న పోరాటానికి సత్యసాయి ట్రస్టు తన వంతు సహకారం అందించింది. ఈ మేరకు సీఎం సహాయ నిధికి రూ. 5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రూ. 5 కోట్ల చెక్కు అందజేశారు. ఈ మొత్తాన్ని కరోనా నివారణ చర్యల కోసం వినియోగించాలని కోరారు.
ఏపీ సీఎం సహాయనిధికి ఇవాళ భారీగా విరాళాలు
ముఖ్యమంత్రి సహాయనిధికి పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్.జగన్కు రూ.2 కోట్ల చెక్ను పెన్నా సిమెంట్స్ ఛైర్మన్ పెన్నా ప్రతాప్ రెడ్డి అందించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా కోటి రూపాయిలు విరాళాలు ప్రకటించింది. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డా. సాంబశివారెడ్డి, డా.చంద్రశేఖర్రెడ్డిలు కోటి రూపాయిల చెక్ను సీఎం జగన్కు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ , పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్లు రెండు రోజుల వేతనంను రూ.1.15 కోట్లు విరాళం ప్రకటించారు. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిసి విరాళానికి సంబంధించిన వివరాలు అందజేశారు.
కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళం ఇచ్చిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సీఎం శ్రీ వైయస్.జగన్కు రూ.2కోట్ల చెక్ అందించిన పెన్నా సిమెంట్స్ ఛైర్మన్ పెన్నా ప్రతాప్ రెడ్డి #APFightsCorona #YSJaganCares pic.twitter.com/CtYmuRxzbK
— YSR Congress Party (@YSRCParty) April 4, 2020
కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం కోటి రూపాయలు విరాళం ఇచ్చిన ఏపీ మెడికల్ కౌన్సిల్. సీఎం శ్రీ వైయస్.జగన్కు కోటి రూపాయల చెక్ అందజేసిన ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ బి.సాంబశివారెడ్డి, మరియు డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి #APFightsCorona #YSJaganCares pic.twitter.com/ZjhxLCSQmA
— YSR Congress Party (@YSRCParty) April 4, 2020
కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళం ఇచ్చిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. సీఎం శ్రీ వైయస్.జగన్కు రూ. 5 కోట్ల చెక్కు అందజేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే.రత్నాకర్#APFightsCorona #YSJaganCares pic.twitter.com/FqUoEn1vpF
— YSR Congress Party (@YSRCParty) April 4, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire