సీమను సస్యశ్యామలం చేస్తేనే వైఎస్ఆర్‌ ఆత్మ శాంతిస్తుంది: టీజీ

సీమను సస్యశ్యామలం చేస్తేనే వైఎస్ఆర్‌ ఆత్మ శాంతిస్తుంది: టీజీ
x
Highlights

రాయలసీమను సస్యశ్యామలం చేస్తేనే వైఎస్ఆర్‌ ఆత్మ శాంతిస్తుందని బిజెపి ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు. తెలంగాణ కన్నా రాయలసీమ పూర్తిగా వెనకబడ్డ ప్రాంతమని,...

రాయలసీమను సస్యశ్యామలం చేస్తేనే వైఎస్ఆర్‌ ఆత్మ శాంతిస్తుందని బిజెపి ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు. తెలంగాణ కన్నా రాయలసీమ పూర్తిగా వెనకబడ్డ ప్రాంతమని, రాయలసీమ బాగుపడటం కోసం స్పెషల్ స్టేటస్‌తో పాటు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు బిజెపి ఎంపీ, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేష్. కర్నూల్ లో జరిగిన రాయలసీమ హక్కుల ఐక్య వేదిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గుండ్రేవుల ప్రాజెక్ట్ మరియు సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి జగన్‌ ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. జగన్ కరువు సీమను రతనాల సీమగా తీర్చి దిద్దాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories