తిరుమలలో వేంకన్న స్వామి కిరీటం మాయం?

తిరుమలలో వేంకన్న స్వామి కిరీటం మాయం?
x
Highlights

తిరుమలలో కలకలం రేకెత్తింది. స్వామివారి ఆభరణాలు చోరికి గురైనట్లు తెలుస్తో్ంది. ఆలస్యంగా తెలిసిన వివరాల ప్రకారం.. టీటీడీ ట్రెజరీలోని 5 కిలోల వెండి కిరీటం మాయమైంది.

తిరుమలలో కలకలం రేకెత్తింది. స్వామివారి ఆభరణాలు చోరికి గురైనట్లు తెలుస్తో్ంది. ఆలస్యంగా తెలిసిన వివరాల ప్రకారం.. టీటీడీ ట్రెజరీలోని 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లు సమాచారం. దీనిపై టీటీడీ ఏఈవో శ్రీనివాసులపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆభరణాల విలువను అతడి జీతం నుంచి రికవరీ చేసారని సమాచారం. అసలు ఈ ఘటనకు కారకులెవరన్న విషయంపై టీటీడీ దృష్టి సారించకుండా.. కేవలం ఏఈవో శ్రీనివాసుల జీతం నుంచి రికవరీ చేయడంపై భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆయనొక్కరినే ఎందుకు బాధ్యుల్ని చేశారన్న దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories