పోలవరం ఎమ్మెల్యేకు భద్రత పెంపు

పోలవరం ఎమ్మెల్యేకు భద్రత పెంపు
x
Highlights

ఒకవైపు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించి ఓటమి పాలైన వారందరికీ భద్రతను ఉపసంహరిస్తూనే మరోవైపు అధికారపక్షంలో ఉన్న శాసన సభ్యుల విషయంలో మరికొన్ని...

ఒకవైపు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించి ఓటమి పాలైన వారందరికీ భద్రతను ఉపసంహరిస్తూనే మరోవైపు అధికారపక్షంలో ఉన్న శాసన సభ్యుల విషయంలో మరికొన్ని జాగ్రత్తలను పోలీసులు పాటిస్తున్నారు. ఇప్పటిదాకా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సాధారణ ఎమ్మెల్యేగా 1+1 కేటిగిరిలో భద్రత కల్పిస్తున్నారు. కాని దీనిని తాజాగా సవరించారు. దీని ప్రకారం ఎమ్మెల్యే బాలరాజుకు మంత్రులతో సమానంగా 2+2 భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడం, అందున ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలు ఆంధ్రాలో విలీనం కావడం, మావోయిస్టుల సంచారం ఉండడం కారణంగా ఈచర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories