పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ

పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ
x
పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ
Highlights

కడప జిల్లా పులివెందులలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి మంగళవారం...

కడప జిల్లా పులివెందులలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. వేంపల్లెలోని తన నివాసంలో ముఖ్య నేతలతో సతీష్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాను టీడీపీని వీడుతున్నట్లు సతీష్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సరైన ఆదరణ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనసును చంపుకొని తెలుగుదేశం పార్టీలో ఉండేది లేదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories