ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
x
Highlights

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం నుండి తణుకు వెళ్లే జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం నుండి తణుకు వెళ్లే జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. వీరు ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే క్షణాల్లో సజీవ దహనమయ్యారు. తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ రవికుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక యంత్రంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories