అరటితోటలో పూజలు .. అనుమానించిన గ్రామస్థులు కానీ చివరకి ..

అరటితోటలో పూజలు .. అనుమానించిన గ్రామస్థులు కానీ చివరకి ..
x
Highlights

గ్రామాలల్లో అర్దరాత్రి పూజలు చేస్తే సహజంగా అయితే అవి క్షుద్రపూజలనే అనుకుంటారు. ఇలాగే ఓ గ్రామంలో కూడా గ్రామస్థులు కూడా ఇలాగే అనుకున్నారు కానీ చివరికి...

గ్రామాలల్లో అర్దరాత్రి పూజలు చేస్తే సహజంగా అయితే అవి క్షుద్రపూజలనే అనుకుంటారు. ఇలాగే ఓ గ్రామంలో కూడా గ్రామస్థులు కూడా ఇలాగే అనుకున్నారు కానీ చివరికి అసలు విషయం తెలుసుకున్నారు . ఇంతకి జరిగింది ఏంటంటే ..అమలాపురం పట్టణానికి చెందిన ఆలయ పూజారి రాంపల్లి శేషసాయి కుమారుడు శివదుర్గాప్రసాద్‌కు వివాహం కావడంలేదు. దీనితో ఆయన పలువురు సిద్ధాంతులును కలిసారు .

అందులో భాగంగా జిలగం వీరముక్తిలింగేశ్వరరావు అనే సిద్దాంతి కాలసర్ప దోషంతో తన బిడ్డకు వివాహం ఆలస్యమవుతోందని అరటి చెట్టుతో మీ బిడ్డకు ముందుగా వివాహం జరిపిస్తే కల్యాణం జరుగుతుందని చెప్పారు. దాంతో సిద్ధాంతికి చెందిన తోటలోనే ఈ వివాహ తంతు బుధవారం రాత్రి చేపట్టారు. అరటితోటలో శబ్ధాలు రావడంతో గ్రామస్థులు వారిని చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు . దీనిపై ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories