రేపటి నుంచి ప్రభుత్వ వైన్ షాపులు.. బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు

రేపటి నుంచి ప్రభుత్వ వైన్ షాపులు.. బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ వైన్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలకు నేటితో తెరపడనుంది. రేపటి నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఈ నేపద్యంలో,...

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ వైన్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలకు నేటితో తెరపడనుంది. రేపటి నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఈ నేపద్యంలో, షాపులను ఖాళీ చేసే పనుల్లో మద్యం వ్యాపారులు ఉన్నారు. దీంతో మద్యం వ్యాపారాలు ప్రీమియం బ్రాండ్‌లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించారు. సోమవారం రాత్రి 10 గంటల తర్వాత ప్రైవేటు మద్యం షాపుల్లో ఉన్న స్టాకును ఎక్సైజ్ శాఖకు అప్పగించాల్సి ఉండటంతో నిల్వ ఉన్న సరకుపై డిస్కౌంట్లు ఇస్తున్నారు. దీంతో మందుబాబులు పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గత రెండు వారాలుగా రెగ్యులర్‌గా ఎక్కువగా అమ్ముడుపోయే బ్రాండ్లను మాత్రమే మద్యం వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories