తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కోవింద్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కోవింద్
x
Highlights

రెండు రోజుల తిరుమల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు....

రెండు రోజుల తిరుమల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. రాష్ర్టపతి వెంట గవర్నర్ నరసింహన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ర్టపతి పర్యటన నేపధ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కోవింద్ శ్రీహరికోట వెళ్లనున్నారు. సోమవారం తెల్లవారుజామున చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగాన్ని వీక్షించనున్నారు. ఆ తర్వాత తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories