ముగిసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీ పర్యటన

ముగిసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీ పర్యటన
x
Highlights

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీ పర్యటన ముగిసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఆయన ఈ సోమవారం ఢిల్లీ తిరుగు...

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీ పర్యటన ముగిసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఆయన ఈ సోమవారం ఢిల్లీ తిరుగు ప్రయాణమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి కోవింద్‌కు వీడ్కోలు పలికారు. సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ఇతర ప్రముఖులు ఉదయం పదిగంటల ప్రాంతంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని రాష్ట్రపతిని సాగనంపారు. అనంతరం సీఎం జగన్‌ 10.30 గంటలకు రేణిగుంట విమానశ్రయం నుంచి గన్నవరం తిరుగు ప్రయాణమయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories