ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ షురూ!

ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ షురూ!
x
Highlights

ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ల సమావేశం ముగియడంతో ప్రజావేదిక కూల్చివేతకు అధికారులు...

ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ల సమావేశం ముగియడంతో ప్రజావేదిక కూల్చివేతకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సీఆర్డీయే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రజావేదిక నుంచి ఫర్నిచర్, ఏసీలు, మైక్‌ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సామాగ్రి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజావేదిక నుంచి పూల కుండీలను హైకోర్టు సమీపంలోని నర్సరీకి తరలించారు. కూల్చివేతపై సీఆర్డీయే ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories