కోడెల మృతిపై పవన్ కల్యాణ్ స్పందన..పోరాటం జరిపి ఉంటే...

కోడెల మృతిపై పవన్ కల్యాణ్ స్పందన..పోరాటం జరిపి ఉంటే...
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్రావు మరణం పట్ల జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన మృతికి తన తరఫున, పార్టీ తరఫున సంతాపం...

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్రావు మరణం పట్ల జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన మృతికి తన తరఫున, పార్టీ తరఫున సంతాపం తెలియజేశారు. రాజకీయవేత్తగా అంచెలంచలుగా ఎదిగి శాసనసభ్యునిగా, మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఎన్నో పదవుల్ని అలంకరించారన్నారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు ఎదురుకోలేక ఆయన తుదిశ్వాస విడవటం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేదన్నారు పవన్. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ఆపత్కాల సమయంలో కోడెల కుటుంబసభ్యులకు ఆ దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుతున్నానన్నారు. తన తరపున, పార్టీ తరపున కోడెల మృతికి తీవ్ర సంతాపం తెలిపారు పవన్ కల్యాణ్.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories