విశాఖ ఏజెన్సీలో మరోసారి కాల్పుల కలకలం

విశాఖ ఏజెన్సీలో మరోసారి కాల్పుల కలకలం
x
Highlights

విశాఖ ఏజెన్సీ మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. జీకే వీధి అటవీ ప్రాంతంలో కూంబింగ్ బలగాలు, మావోయిస్టుల జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి...

విశాఖ ఏజెన్సీ మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. జీకే వీధి అటవీ ప్రాంతంలో కూంబింగ్ బలగాలు, మావోయిస్టుల జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో సుమారు 20 నిమిషాల పాటు తుపాకుల మోత మ్రోగింది. నిన్నటి కాల్పుల్లో గాయపడిన మావోయిస్టుల కోసం గాలిస్తున్న కూంబింగ్ బలగాలపై.. మావోయిస్టులు కాల్పులకు దిగడంతో.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు, చింతపల్లి మండలం గుమ్మలేరు దగ్గర కూడా ఎదురు కాల్పులు జరిగాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories