కాకినాడలో అర్థరాత్రి క్షుద్రపూజలు..!

కాకినాడలో అర్థరాత్రి క్షుద్రపూజలు..!
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గొడారిగుంట సీతారామపురం దగ్గర కమ్యూనిటీ హాల్‌లో క్షుద్రపూజలు చేస్తుండటంతో స్థానికులు తీవ్ర...

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గొడారిగుంట సీతారామపురం దగ్గర కమ్యూనిటీ హాల్‌లో క్షుద్రపూజలు చేస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పసుపు కుంకుమ, నిమ్మకాయలు, కోళ్లతో క్షుద్రపూజలు చేయడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నపోలీసులు ఏడుగురికి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్షుద్రపూజలపై జనాలు అంత ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదుపులోకి తీసుకున్న నిందితులను ప్రశ్రించగా గ్రామంలో ఉన్న 30 మంది చనిపోయారని, వారికోసమే పూజలు చేస్తున్నామని తెలిపారు. అయితే వారు చెప్పిన మాటలు నమ్మసక్యంగా లేవని ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories