అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో నూతన మద్యం విధానం..బార్ షాపుల..

అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో నూతన మద్యం విధానం..బార్ షాపుల..
x
Highlights

ఏపీలో అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. రాష్ర్టంలోని 3500 షాపులు నిర్వహించడానికి...

ఏపీలో అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. రాష్ర్టంలోని 3500 షాపులు నిర్వహించడానికి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే దుకాణాలను ఉదయం పది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే తెరిచి ఉంటాయని చెప్పారు. బార్ షాపుల సమయాలు కుదించనున్నామని మంత్రి చెప్పారు. దశలవారీగా మద్య నిషేదానికి అంతా సహకరించాలని కోరారు. 678 కొత్త ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రపోజల్స్ పంపించామన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories