మనం పాలకులం కాదు..సేవకులం అని గుర్తుపెట్టుకోవాలి: సీఎం జగన్

మనం పాలకులం కాదు..సేవకులం అని గుర్తుపెట్టుకోవాలి: సీఎం జగన్
x
Highlights

వైసీపీ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా...

వైసీపీ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. ప్రజా పాలకులం అన్న విషయం గుర్తెరగాలన్నారు. మేనిఫెస్టోను పవిత్రగ్రంథంలా భావించాలన్నారు. మంత్రులు, అధికారులందరి దగ్గర తప్పకుండా మేనిఫెస్టో ఉండాలని ఆదేశించారు. నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా పనిచేయాలని సీఎం జగన్ అన్నారు. మనం పాలకులం కాదు..సేవకులం అని గుర్తుపెట్టుకోవాలని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వంలో అందరూ భాగస్వాములేనని మేనిఫేస్టోలోని అన్ని అంశాలను నెరవేర్చాలని సీఎం జగన్ అధికారులతో మాట్లాడారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories