జీవితాంతం శుక్రవారం కోర్టుకెళ్లాలని భయమా? : నారా లోకేష్‌

జీవితాంతం శుక్రవారం కోర్టుకెళ్లాలని భయమా? : నారా లోకేష్‌
x
Highlights

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్‌. గతంలో రావాలి సీబీఐ.. కావాలి సీబీఐ అన్నవాళ్లు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ...

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్‌. గతంలో రావాలి సీబీఐ.. కావాలి సీబీఐ అన్నవాళ్లు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన పెద్ద మనుషులు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ సీబీఐ వద్దు అని ఎందుకు అంటున్నారని నిలదీశారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు ఆత్మహత్యలు చేసుకోవడం వెనుక రహస్యం ఏముందని అడిగారు. కోడికత్తి వెనుక మహాకుట్ర ఉందని ఈ కేసులో నిందితుడికి జైల్లోనే ప్రాణహాని ఉండే పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే నిజాలు బయటపడి జీవితాంతం శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారా అని లోకేశ్ నిలదీశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories